Tirumala VIP Darshan రాజకీయ నేతల సిఫార్సు లేఖలు అవసరం లేకుండానే తిరుమల శ్రీవారి విఐపి దర్శనం
Tirumala VIP Darshan తిరుమల విఐపి దర్శనం కోసం లీడర్ల సిపార్సు లెటర్ల కోసం ఎదురుచూపులు లీడర్ల కోసం తిరిగే పని లేకుండా శ్రీవారి విఐపి దర్శనం ఇప్పుడు చేసుకోవచ్చు . తిరుమల శ్రీవారి దర్శనం అంటే ప్రతి ఒక్క హిందువుకు ఎంతో ముఖ్యం పెళ్లి రోజున, పుట్టినరోజును,జీవితంలో ఏదైనా మంచి జరిగిన రోజును, ఏదైనా సాధించిన రోజును తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అంటే ప్రతి హిందువుకి ఎంతో ఇష్టం. ఎంతో దూరప్రాంతాల నుంచి వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోవాలని అందరూ అనుకుంటారు అందుకే తిరుమల కొండపైన ఎల్లప్పుడూ విపరీతమైన రద్దీ ఉంటూనే ఉంటుంది. స్పెషల్ దర్శనం లో రూ.300 దర్శనం టికెట్లను మూడు నెలల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక వీఐపీ దర్శన టికెట్లు అయితే రాజకీయ నేతల సిఫార్సు లేఖలు అవసరం ఉంటుంది.
విమానాశ్రయంలో శ్రీవాణి విఐపి దర్శనం కౌంటర్
Tirumala VIP Darshan అయితే ఇప్పటి నుంచి విఐపి దర్శన టికెట్లకు రాజకీయ నేతల సిఫార్సు లేఖలు అవసరం లేకుండానే తిరుమల శ్రీవారి దర్శనం జరగబోతుంది శ్రీవాణి పథకం ద్వారా విఐపి దర్శన టికెట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పిస్తోంది ఎయిర్పోర్టులోనూ ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో దిగిన వెంటనే శ్రీవాణి వీఐపీ దర్శన టికెట్లు కొనుగోలు చేసి శ్రీవారి దర్శనానికి వెళ్ళవచ్చు ఇప్పటివరకు ఉన్న శ్రీవాణి వీఐపీ టికెట్ల సంఖ్య పెంచుతూ టీటీడీ సరికొత్త నిర్ణయం తీసుకుంది తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ప్రతిరోజు జారీ చేస్తున్న శ్రీవాణి వీఐపీ దర్శన టికెట్ల సంఖ్యను టీటీడీ 100 నుంచి 200కు పెంచుతూ రేసెంటుగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ సదుపాయం రేణిగుంట విమానాశ్రయంలో కరెంటు బుకింగ్ కౌంటర్లో భక్తులు టికెట్లను బుక్ చేసుకుని శ్రీవారి దర్శనం పొందవచ్చు అని టీటీడీ తెలిపింది బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి విమానాశ్రయం కౌంటర్లో మాత్రమే ఈ ఆఫ్ లైన్ సదుపాయం జారీ చేస్తారు
తిరుమల కొండపైన శ్రీవాణి విఐపి కౌంటర్
Tirumala VIP Darshan అలాగే తిరుమల కొండపైన గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్లో ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను టీటీడీ 900 నుంచి 800 కు తగ్గించింది మొదట వచ్చినవారికి మొదటి ప్రాధాన్యతగా ఈ శ్రీవాణి వీఐపీ టికెట్లను టీటీడీ జారీ చేస్తుంది ప్రతిరోజు వెయ్యి మంది వరకు ఈ వీఐపీ దర్శనం చేసుకోవచ్చు .ప్రతిరోజూ ఈ శ్రీవాణి విఐపి టికెట్స్ అందుబాటులో ఉంటాయి కానీ మొదటి ౮౦౦భక్తులకి మాత్రమే ఈ సదుపాయం కలుగుతుంది ప్రతిరోజూ చాల రద్దీగా ఉంటుంది కాబట్టి ముందుగా ఈ టికెట్స్ కోసం ఆలోచిస్తే మంచిది .
శ్రీవాణి విఐపి దర్శనం టికెట్ ధర
ఈ శ్రీవాణి విఐపి దర్శనం టికెట్ ధర పదివేల రూపాయలు ఉంటుంది ఇప్పటివరకు శ్రీవాణి ట్రస్ట్ కు 10000 విరాళం ఇచ్చేవారికి 500 రూపాయలు కలిపి మొత్తం పది,500కు ఈ టికెట్ ఇస్తున్నారు నిధులన్నీ శ్రీవారి ట్రస్టుకు వెళ్లేవి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రూల్స్ మారాయి తిరుమలలో కొత్త టీటీడీ బోర్డు ఏర్పడిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకున్నారు భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు సరికొత్త చర్యలు మొదలుపెట్టారు ఈ క్రమంలో రాజకీయ నేతల వద్దకు వెళ్లడం కన్నా ఇలా శ్రీవాణి టిక్కెట్లు కొనుగోలు చేసుకోవడం మంచిదని భావించే భక్తుల కోసం ఈ ఏర్పాట్లు చేశారు.ఇప్పుడు కేవలం రూ. 10000/- ఈ శ్రీవాణి విఐపి దర్శనం టికెట్ తీసుకొని విఐపి దర్శనం చేసుకోవచ్చు కావున భక్తులు అందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
నమోవెంకటేశాయ
ప్రశ్నలు మరియు సమాదానాలు
1 ) శ్రీవాణి విఐపి దర్శనం టికెట్ ధర ఎంత ?
A ) శ్రీవాణి విఐపి దర్శనం టికెట్ ధర 10 ,000 /- పదివేల రూపాయలు ఉంటుంది .
2 ) తిరుమల శ్రీవారి విఐపి దర్శనం కోసం రాజకీయ నేతల సిఫార్సు లేఖలు అవసరమా ?
A ) తిరుమల శ్రీవారి విఐపి దర్శనం కోసం రాజకీయ నేతల సిఫార్సు లేఖలు అవసరం లేదు .
3 ) శ్రీవాణి విఐపి దర్శనం కౌంటర్ ఎక్కడ ఉన్నాయి ?
A ) శ్రీవాణి విఐపి దర్శనం కౌంటర్ తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో దిగిన వెంటనే శ్రీవాణి వీఐపీ దర్శన కౌంటర్ ఉంది. అలాగే తిరుమల కొండపైన గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు శ్రీవాణి విఐపి దర్శనం కౌంటర్ ఉంది.
4 ) తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి విఐపి దర్శనం టికెట్ ఎలా తీసుకోవాలి ?
A ) తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి విఐపి దర్శణం టికెట్ బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి విమానాశ్రయం కౌంటర్లో శ్రీవాణి విఐపి దర్శనం టికెట్ తీసుకోవాలి .
5 ) తిరుమల కొండపైన గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు శ్రీవాణి విఐపి దర్శనం కౌంటర్ లో శ్రీవాణి విఐపి దర్శనం టికెట్ ఎలా తీసుకోవాలి ?
A ) తిరుమల కొండపైన గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు శ్రీవాణి విఐపి దర్శనం కౌంటర్ లో శ్రీవాణి విఐపి దర్శనం టికెట్ ఆధార్ ఆధారంగా శ్రీవాణి విఐపి దర్శనం టికెట్ తీసుకోవాలి .